తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇక సికింద్రాబాద్ లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. కరోనాతో సికింద్రాబాద్ లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కార్పొరేట్ ఆస్పత్రి వైద్యాధికారి తండ్రి కూడా కరోనాతో శనివారం మృతి చెందారు.
సికింద్రాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యాధికారికి, ఆయన తండ్రికి ఇటీవల కరోనా పాజిటివ్గా వచ్చింది. గోల్నాక శాంతినగర్కు చెందిన దివ్యాంగుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. అతనికి ఈ నెల 1 న కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే మరో 54 ఏళ్ళ వ్యక్తి కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెప్తున్నారు. కాగా తెలంగాణా నిన్న ఒక్క రోజు 200 మందికి పైగా కరోనా సోకింది.