టీడీపీ మాజీ మంత్రి, చిత్తూరు జిల్లా సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు జయంతి సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన నివాసం వద్ద ఆయన కుమారుడు గాలి భాను ప్రకాష్ పేదలకు సహాయ కార్యక్రమాలు కూడా చేసారు. ఇక వైసీపీ నేతలు కూడా ఆయనను స్మరించుకున్నారు.
ఇక ఆయనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. నిబద్దత, నిజాయితీ గల ప్రజా నాయకులలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు ఒకరు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ చిరస్మరణీయ నేత స్మృతికి నివాళులర్పిస్తూ... పార్టీకి, ప్రజలకు ముద్దు కృష్ణమ నాయుడు గారు చేసిన సేవలను మననం చేసుకుందామని పేర్కొన్నారు.
నిబద్దత, నిజాయితీ గల ప్రజానాయకులలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమనాయుడుగారు ఒకరు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ చిరస్మరణీయ నేత స్మృతికి నివాళులర్పిస్తూ... పార్టీకి, ప్రజలకు ముద్దు కృష్ణమనాయుడుగారు చేసిన సేవలను మననం చేసుకుందాం pic.twitter.com/yaCc05AlXz
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) June 9, 2020