దేశంలో లాక్ డౌన్ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. లాక్ డౌన్ ని మళ్ళీ విధించే అవకాశం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ని విధించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు రావడంపై రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన అనేది తీవ్ర స్థాయిలో ఉంది. 

 

ఇక ఇప్పుడు దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చేసారు. మళ్ళీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందనే వార్తలపై స్పష్టత ఇవ్వాలి అని ప్రధాని నరేంద్ర మోడిని వీడియో కాన్ఫరెన్స్ లో సిఎం కేసీఆర్ కోరగా దానికి స్పందించిన ప్రధాని దేశంలో లాక్ డౌన్ దశ ముగిసింది అని అన్ లాక్ దశ మొదలైందని మోడీ స్పష్టం చేసారు. దీనిపై కేసీఆర్ స్పందించారు. లాక్ డౌన్ ఉండదు అని మోడీ చెప్పారని అన్నారు. అన్ లాక్ 2.o ఎలా అమలు చెయ్యాలి అనే దాని మీద చర్చించుకోవాలని సూచించారని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: