మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జిత్తు పట్వారి వ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారి పోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల నినాదం అయిన సబ్కా సాత్ సబ్కా వికాస్ పై ఆయన విమర్శలు చేయబోయే వివాదంలో పడ్డారు. పెద్ద నోట్ల రద్దు జిఎస్టి ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆర్థిక మాంద్యాన్ని కుమార్తెలతో.. అభివృద్ధిని కుమారుడు తో పోల్చడం వివాదాస్పదంగా మారిపోయింది.
ప్రజలందరూ అభివృద్ధి అనే కుమారుని ఆశిస్తే... పెద్ద నోట్ల రద్దు జిఎస్టి ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆర్థిక మాంద్యం లాంటి ఐదుగురు కుమార్తెలు ను పొందారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదుగురు కూతుళ్లు పుట్టారు కానీ... వికాస్ మాత్రం పుట్టలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక దీనిపై విమర్శలు రావడంతో తాజాగా దీనిపై స్పందించిన ఆయన క్షమాపణలు చెప్పారు,