తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల ముంగిట కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరే సిఎం అంటూ అధికార అన్నాడిఎంకె పార్టీ కార్యకర్తలు... ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ని ఉద్దేశించి కొన్ని పోస్టర్లు ప్రదర్శించారు. “పురట్చి తలైవి ఆశీర్వదించిన ఏకైక ముఖ్యమంత్రి” అని పోస్టర్లు అంటించారు.
అయన ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని స్పష్టంగా చెప్తూ పోస్టర్లు ప్రదర్శించారు. జయలలిత సిఎంగా ఉన్న సమయంలో ఇబ్బందులు పడిన సందర్భంలో పన్నీర్ సెల్వం నే సిఎం గా ఎంపిక చేసారు. మరొకరు అతను సాధారణ ప్రజలకు మరియు పేదలకు "ముఖ్యమంత్రి" అని పోస్టర్ పెట్టారు. శాశ్వత ముఖ్యమంత్రి అంటూ మరొక పోస్టర్ కనపడింది. రకరకాల పోస్టర్లలో కనిపించే ఒక సాధారణ ట్యాగ్‌లైన్ 2021 ఎన్నికల్లో సిఎం పన్నీర్ సెల్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: