తెలంగాణాలో గత కొంత కాలంగా మావోల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపుగా నెల రోజుల నుంచి ఎప్పుడు ఎం జరుగుతుందో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మావోలు కూడా ప్రజల్లో మద్దతు కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు  తెలంగాణా  రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం వాతావరణం కాస్త వేడెక్కింది.

తాజాగా భద్రాద్రి జిల్లా ఎస్ పి సునీల్ దత్ కీలక హెచ్చరికలు చేసారు. చత్తీస్ గడ్ సరిహద్దు భద్రాచలం ,దుమ్ము గూడెం, చర్లలలో భారీ ఎత్తున మావోల కోసం కూంబింగ్ కొనసాగుతుంది అని ఆయన తెలిపారు. ప్రజలు ఎవ్వరు చత్తీస్ గడ్ వైపు వెళ్లవద్దు అని ఆయన హెచ్చరించారు. వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని సూచించారు.  కాగా ఇటీవల తెలంగాణాలో వరుస ఎన్కౌంటర్ లు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.`

మరింత సమాచారం తెలుసుకోండి: