విశాఖలో ఇప్పుడు భూ అక్రమాల విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేస్తుంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.  విశాఖలోని భూములపై జగన్మోహన్రెడ్డి బంధువులు రాబందుల్లా వాలిపోతున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, పెందుర్తి లో  4.9 ఎకరాల భూమి  కొన్నానని ఒప్పుకున్నారు అని చెప్పుకొచ్చారు.

 జగన్మోహన్ రెడ్డి ,  విజయమ్మ, గాలి జనార్దన్ రెడ్డి తో ఉన్న ఫోటోలు అందుకు నిదర్శనం అన్నారు. పెందుర్తి వైసీపీ నేతలు  మాత్రం ఆయన ఎవరో మాకు తెలియదు, తమ పార్టీ కాదని  చెబుతున్నారని, ఆ వ్యక్తి మీ పార్టీ కాదా.. భూమి కబ్జా అయిందా లేదా.. చెప్పాలి అని డిమాండ్ చేసారు.  భూమి ఎవరిది అనేది అధికారులను చెప్పమనండి సవాల్ చేసారు. జగన్ బంధువులు చేస్తున్న అరాచకాలను అరికట్టాల్సిన అవసరం ఉంది అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: