గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు ప్రచారం విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త దూకుడుగానే వెళ్తుంది. ఈ క్రమంలో కాస్త విమర్శలు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీడ్ పెంచారు. తాజాగా... కాంగ్రెస్ తెలంగాణా అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్,బీజేపీ దొంగ నాటకాలు అడుతున్నాయు అని ఆయన మండిపడ్డారు.

జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కి సీఎం కేసీఆర్ మద్దతు పలికారా లేదా? అని నిలదీశారు. బండి సంజయ్ కు రాజకీయ అవగాహన లేదని స్పష్టంగా అర్థం అవుతుంది అన్నారు. కరీంనగర్ లో చిల్లర కార్పొరేటర్ గా గెలిచిన ఆయన ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని విమర్శించారు. బండి సంజయ్ కు హైదరాబాద్ ఎక్కడుందో కూడా సరిగా తెలియదు అన్నారు. అలాంటి వ్యక్తికి ప్రెసిడెంట్ ఇస్తే ఇలాగే ఉంటుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: