ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన వ్యవహారం బీ ఫార్మసీ విద్యార్ధిని కిడ్నాప్... ఘట్ కేసర్‌లో నన్ను కిడ్నాప్ చేశారంటూ డ్రామా ఆడటం ఆ తర్వాత ఆటో డ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేయడం వంటివి జరిగాయి. కాని ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. కుటుంబ‌స‌భ్యు‌లతో ఉండటం ఇష్టం లేని ఆ అమ్మాయిని కిడ్నాప్ డ్రామా ఆడింది.

ఆ తర్వాత పోలీసులు మీడియాకు అసలు విషయం చెప్పడంతో కుటుంబం కూడా షాక్ అయింది. ఇక ఆ తర్వాత ఆమెను అమ్మమ్మ ఇంటికి పంపించారు. అయితే ఇప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం చేయగా... అమ్మమ్మ ఇంట్లో ఆమె షుగర్ టాబ్లెట్ లు మోతాదుకి మించి మింగి ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్ మార్టం కోసం ఆమె మృతదేహాన్ని తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: