ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్‌. ష‌ర్మిల తెలంగాణ‌లో కొత్త పార్టీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా ఆమె కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌, పేరు ఎప్పుడు అనేది క్లారిటీ వ‌చ్చేసింది. ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల చర్చించారు. ‘వైఎస్సార్‌టీపీ’.. ‘వైఎస్సార్‌ పీటీ’.. రాజన్నరాజ్యం అనే పేర్లను ఆమె  పరిశీలించారు. మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఏదేమైనా ష‌ర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: