కర్ణాటకలో కరోనా బీభత్సం చేస్తుంది. గత 24 గంటల్లో 31,531 కేసులు నమోదు కాగా, 403 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈ కేసులతో కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 22,03,462 కి చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 21,837 గా ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం కేసుల సంఖ్య ఎక్కుగానే బెంగుళూరు ప్రాంతంలో ఉండటం గమనార్హం. దేశంలో మిగతా రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఒకింత తగ్గుముఖం పడుతుంది. కానీ మహారాష్ట్ర, గుజరాత్. యూపీ, ఛత్తీస్‌గ‌ఢ్‌ల‌లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: