మనస్పర్థల కారణంగా 20 ఏళ్లు దూరంగా ఉన్న భార్య భర్తలను కలిపి సిజెఐ ఎన్వీ రమణ వార్తల్లోకి ఎక్కారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. మనస్పర్థల కారణంగా గత 20 ఏళ్లుగా దూరంగా ఉన్న భార్య భర్తలను ఆయన ఒకటి చేశారు. తెలుగులోనే వారి వాదనలు విని మరీ వారిద్దరినీ ఒప్పించి కలిసేలా  చేశారు. నిజానికి సుప్రీంకోర్టు స్థాయిలో వాది, ప్రతివాదులను కోర్టుకు పిలవరు వారి తరఫున న్యాయవాదులే వాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడే సిజెఐ ఎన్వీ రమణ భార్య భర్తల మనోగతాన్ని స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలా మొత్తం మీద ఎన్వీ రమణ వార్తల్లోకి ఎక్కారు. సుప్రీం చరిత్రలో దీనిని అరుదైన కేసుగా భావిస్తున్నామని కొంతమంది న్యాయవాదులు మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: