ప్రపంచ దేశాలలో ఇండియా రిలేషన్స్ పెరుగుతున్న వేళ వ్యాపార లావాదేవీలు కూడా చాలా భారీగానే జరుగుతున్నాయి. ఈ కారణంగా ప్రపంచ బ్యాంక్ 'లాజిస్టిక్ పెర్ఫామెన్స్ ఇండెక్స్‌ 2023' లిస్టులో ఇండియా తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది.మొత్తం 139 దేశాల ఈ సూచికలో 2018 వ సంవత్సరంలో 48వ ర్యాంక్‌లో ఉన్న ఇండియా ఏకంగా ఆరు స్థానాలు ఎగడాకి తాజా సూచికలో 38వ ర్యాంక్‌ని సొంతం చేసుకుంది.సాఫ్ట్ ఆండ్ హార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు టెక్నాలజీలో కూడా గణనీయమైన పెట్టుబడులు పెట్టడం వల్ల ఇండియా ర్యాంక్ మెరుగుపడేందుకు దారితీసింది.అంతర్జాతీయ షిప్‌మెంట్‌ 2013 వ సంవత్సరంలో కూడా ఇండియా ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది. 2018 వ సంవత్సరంలో 44వ స్థానంలోని ఇండియా ఇప్పుడు 22కి చేరుకుంది. అలాగే లాజిస్టిక్స్ సామర్థ్యం ఇంకా సమానత్వంలో కూడా 4 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంక్‌కు చేరింది. ఇంకా టైమ్‌లైన్ల ర్యాంకింగ్స్ పరంగా కూడా ఇండియా ఏకంగా 17 స్థానాలు ఎగబాకి గణనీయమైన మెరుగుదలని సాధించింది.


అదనంగా ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్‌లో కూడా 3 స్థానాలను మెరుగుపరుచుకుని 38వ స్థానంలో నిలిచింది ఇండియా.'దేశంలో ఒక దాని తర్వాత మరొకదాని డిజిటలైజేషన్ ఇంకా ముఖ్యంగా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో 70 శాతం కంటే వేగంగా పోర్టులు అందుబాటులోకి వస్తుంటాయి. అలాగే ఇండియాలో గ్రీన్ లాజిస్టిక్స్ కోసం డిమాండ్ పెరుగుతోంది. వీటితోపాటు 75% షిప్పర్లు వెతుకుతున్న పర్యావరణ అనుకూలమైన పరిస్థితులు కూడా ఇండియాలో ఉన్నాయ'ని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది.అలాగే మరోవైపు 'ఓడరేవులు, విమానాశ్రయాలు ఇంకా ఇతరాలలో షిప్పింగ్ అనేది ఎక్కువ సమయం తీసుకుంటోంది. కాబట్టి దేశాలు ఈ అంశాలలో జాప్యాన్ని తగ్గించేలా పనిచేస్తే విశ్వసనీయతను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయ'ని ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కి చెందిన క్రిస్టినా వైడెరర్ తెలిపారు.ఇక ఈ విధంగా ఇండియా వ్యాపార రంగంలో దూసుకుపోతూ తన ర్యాంకింగ్ ని మెరుగుపరచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: