నేటి సమాజంలో మనిషిలో మానవత్వం కనుమరుగైపోతుంది. మానవత్వం కోల్పోయి మనుషుల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇక కట్టుకున్న భార్యనే చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. తాజాగా అలాంటి కోణంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. భార్యలపై అనుమానంతో శాడిస్టు భర్త వారిని అంతమొందించేందుకు అమానుషంగా ప్రవర్తించాడు. మొదటి భార్యను ముక్కు, చెవులు కోసి హతమార్చాలని ప్రయత్నించగా, రెండో భార్యపై ఏకంగా పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టిలో ఈ దారుణం వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా చట్టిలో కళ్యాణం వెంకన్నకు ఇద్దరు బార్యలు. ఆయన తన భార్యలతో అదే ప్రాంతంలో నివసముంటున్నారు. అయితే వారిద్దరికిపై అనుమానం పెంచుకున్న అతను వారిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈనెల 3న రెండో భార్యను గ్రామంలోని దేవతా విగ్రహం వద్దకు తీసుకువెళ్లి వేడి నూనెలో చేతిని ముంచి ప్రయాణం చేయించాడు. ఈ నెల 5న మొదటి భార్యను ఇంట్లోనే చిత్రహింసలకు గురిచేసి, ముక్కు, చెవులు కోసేందుకు యత్నించాడు. ఈ దాడి నుంచి తప్పించుకున్న మహిళ తన పుట్టింటికి పారిపోయింది.

ఇక అదే రోజు రెండో భార్యను మండలంలోని నర్సింపురం సమీపంలోని ఆటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లిన ఆమెపై పెట్రోల్‌ పోలీస నిప్పంటించడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె కూడా భద్రాయలంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తనను చంపేస్తాడనే భయంతో ఆమె ఈ నెల 16న చింతూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, మొదటి భార్యను వేధింపులకు గురి చేస్తున్న సమయంలో నిందితుడు స్వయంగా సెల్ఫీ వీడియో తీశాడు. అది కాస్తా బయటకు రావడంతో ఈ అమానుష ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రెండో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: