సైబర్ నేరగాళ్లు ఇప్పుడు అమ్మాయిలను టార్గెట్ చేశారు..ఇంతకు ముందు హ్యాకింగ్, వివిధ రకాల బ్యాంకింగ్ మోసాల తో డబ్బు కాజేసేవారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పెరడగం తో ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌షిప్ పేరుతో రూ. కోట్ల లో దండుకుంటున్నారు. తాజాగా గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లో 'ఫ్రెండ్‌షిప్ క్లబ్' కుంభకోణం ఒకటి బయటపడింది. సామాన్యులకు మాయమాటలు చెబుతూ రూ.1.54 కోట్లు వసూలు చేశారు ఇద్దరు వ్యక్తులు. ఇప్పటి వరకు 2,500 మంది వీరి వలలో పడ్డారు. తాజాగా ఈ ఇద్దరు నేరస్తులను అహ్మదాబాద్ సైబర్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..


గత ఐదేళ్ల క్రితం నుంచి గుజరాత్‌ లోని వివిధ నగరాల్లో వీరి కార్య కలాపాలు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.అహ్మదాబాద్‌లోని జగత్‌పూర్ ప్రాంతానికి చెందిన సహేదేవ్ జడేజా, జమాల్‌పూర్ నివాసి రాహుల్ బారియా ఇద్దరు కొన్నేళ్లుగా నకిలీ ఫ్రెండ్‌షిప్ క్లబ్‌ను నడుపుతున్నారు. నిరుద్యోగ యువతను వీరు టార్గెట్  చేస్తారు. నిందితులు ఇద్దరూ 2015లో 'ఆన్‌లైన్ ఎర్న్ మనీ' అనే క్లబ్‌ను స్థాపించారు.ఇందులో చేరినవారు మహిళల తో సెక్సువల్ రిలేషన్‌లో ఉంటూ, డబ్బు సంపాదించవచ్చని నమ్మిస్తారు.ముందు ఆన్‌లైన్ ఎర్న్ మనీ సంస్థలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని నిందితులు ప్రకటనలు ఇచ్చేవారు.


రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి అహ్మదాబాద్‌ లోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళల తో లైంగిక సంబంధాలు కూడా పెట్టుకొనేవాళ్ళు..ఇటీవల వీరి ద్వారా మోసపోయిన ఓ వ్యక్తి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయట పడింది.అహ్మదాబాద్ రూరల్ సైబర్ క్రైమ్ సెల్ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు నిందితుల నుంచి 11 మొబైల్ ఫోన్లు, ఏడు డైరీలు, 19 ఏటీఎం కార్డులు, ఐదు ఆధార్ కార్డులు, ఏడు చెక్ బుక్స్, ఐదు పాస్‌బుక్‌ లు స్వాధీనం చేసుకున్నారు. అందరు బాధితుల వివరాలను ఈ డైరీల్లో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇలాంటి ప్రకటనలను చూసి మోసపోవద్దని హెచ్చరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: