చివరికి మహిళా వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక ఆ మహిళకు పెళ్లయి మూడేళ్లు గడుస్తున్నాయ్. అయితే ఒక నెల క్రితమే మహిళ మాజీ బాయ్ ఫ్రెండ్ మళ్లీ ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు ఇక ఒత్తిడి తీసుకురావడంతో ఒకసారి కలిసింది కూడా. ఇద్దరు కలిసి ఎన్నో ప్రాంతాలలో చెట్టాపట్టాలేసుకుని తిరిగారూ. ఈ క్రమంలోనే తన మాజీ ప్రియుడు తన పై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ యువతి ఆరోపిస్తుంది. అంతేకాదు ఏకంగా తన భర్తను వదిలి అతనితో పాటు రావాలి అంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు అని ఆ యువతి చెప్పుకొచ్చింది.
ఇలా తనపై పలుమార్లు అత్యాచారం చేశాడు అంటూ ఆరోపించింది. అయితే ఇటీవలే మరోసారి హోటల్ తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆ మహిళ కు విషం తాగించి.. అతను విషం తాగాడు ఇక ఈ విషయాన్ని సదరు యువకుడు తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన స్నేహితులు వారిద్దరిని కూడా స్థానిక ప్రైవేటు ఆస్పత్రి తరలించారూ. ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి