దేవుడు ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలు లాంటివి మాత్రమే అని చెబుతూ ఉంటారు పెద్దలు. కానీ ఇవన్నీ వట్టి మాటలు మాత్రమే పెద్దలు చాదస్తంతో ఇలాంటివి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు అని అనుకుంటూ ఉంటారు నేటి రోజుల్లో జనాలు. కానీ కొన్ని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. సంతోషంగా సాగిపోతున్న జీవితంలో  అనుకోని ఘటనలు తీవ్రంగా విషాదాన్ని నింపుతూ ఉంటాయ్. సంతోషంగా నిండు నూరేళ్లు జీవిస్తాం అనుకున్న వారే.. ఊహించని ఘటన కారణంగా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి.



 ఇలా సంతోషంగా సాగిపోతున్న జీవితంలో ఊహించని ఘటనలు ప్రాణాలు తీసేస్తూ ఉండటంతో ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగి పోతుంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వాళ్ళది ఒక పేద మధ్యతరగతి కుటుంబం. ఏదో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ హాయిగా జీవిస్తున్నారు. పిల్లాపాపలతో సంతోషంగానే ఉన్నారు. కానీ వీరి సంతోషాన్ని చూసి ఓర్వ లేక పోయింది విధి. చివరికి మృత్యువు ఆ భార్యభర్తలిద్దరిని కూడా కబళించింది. ఊహించని ఘటన ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 బయ్యారం మండలం గంధం పల్లి లో కరెంట్ షాక్ తగిలి భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. భార్య ఉదయాన్నే బట్టలు ఆరేయడానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న కరెంటు తీగలు బట్టలకు తాగడంతో ఇక తిరుపతమ్మకు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో భార్య కరెంట్ షాక్ తో అల్లాడి పోతుంది అన్న విషయాన్ని గ్రహించిన భర్త ఉపేందర్.. వెంటనే భార్యను కాపాడే క్రమంలో అతనికి కూడా కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలోనే ఇద్దరు ప్రాణాలు వదిలారు. భార్యాభర్తలిద్దరూ చనిపోవడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: