సాధారణంగా ఏటీఎం సెంటర్లలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీకెమెరాలకు చిక్కకుండా ఎంతోమంది చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. అయితే దొంగతనాలకు వెళ్లిన వ్యక్తులు చాలా అలర్ట్ గా ఉంటారు. చిన్న గుండు పిన్ను శబ్దం వచ్చిన కూడా ఒక్కసారిగా అప్రమత్తం అవుతూ ఉంటారు. అలాంటిది పెద్ద అలారం మోగింది అంటే చాలు వెంటనే అప్రమత్తమై ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ పాపం ఇక్కడ ఒక దొంగ మాత్రం తనకు ఉన్న సమస్య కారణంగా చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
ఏటీఎంలో చోరీ చేయాలనుకున్న దొంగకు వినికిడి లోపం ఉంది. దీంతో ఏటీఎం చోరీకి వెళ్లి చివరికి కటకటాలపాలయ్యాడు.. ఈ ఘటన తెలంగాణలోని నిజాంబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. సునీల్ అనే వ్యక్తి అర్ధరాత్రి పద్మ నగరంలోని ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఏటీఎం మిషన్ ను పగలగొట్టి డబ్బును కాలచేయాలి అని అనుకున్నాడు.. ఇక ఏటీఎం మిషన్ పగలగొట్టడంతో అలారం మోగింది అతనికి సరిగ్గా చెవులు వినిపించవు. దీంతో శబ్దాన్ని గమనించలేకపోయాడు. కానీ చుట్టుపక్కల వారు మాత్రం ఆ అలారం సౌండ్ కి నిద్ర లేచారు. దీంతో ఏటీఎం దొంగతనం జరుగుతుంది అని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ దొంగకు షాకిచ్చారు. చివరికి అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు.