పెళ్లి చేసుకున్న కొన్నేండ్ల వరకు భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉండేవారు. సినిమాలు, షికార్లకు తిరిగేవారు. ఈ క్రమంలోనే సంగీత భర్త ధనరాజ్ ప్రతిరోజు ఉద్యోగం రిత్యా బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకోవడంతో.. సంగీత ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో ఖాళీగానే ఉంటుంది. భర్త ఇంట్లో లేడని గ్రహించి.. తనకంటే వయస్సులో చిన్నవాడైన ఆశిష్ పాండే (32) సాప్ట్వేర్ ఇంజినీర్తో పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఎంజాయ్ చేసింది.
ఆశిష్ పాండే దకటారా హిల్స్ ప్రాంతంలోని సాగర్ గోల్డెన్ పార్క్ కాలనీలో నివాసముంటాడు. రెండేండ్ల క్రితం ఆశిష్పాండేతో పరిచయం పెంచుకుని తొలుత ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఆ తరువాత అక్రమ సంబంధం కొనసాగించినది. సంగీతా మీనా, ఆశిష్ పాండే అక్రమ సంబంధం గురించి స్థానికులందరూ టామ్ టామ్ చేసారు. భార్య సంగీతా మీనా అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న ఆమె భర్త ధనరాజ్ కోపంతో రగిలిపోయి.. వారి అక్రమ సంబంధాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసాడు భర్త ధనరాజ్ మీనా.
తరుచూ తన భర్త ధనరాజ్ తన సంతోషానికి అడ్డుపడుతున్నాడని ఆగ్రహంతో సంగీతా మీనా ఆమె టెక్కీ ప్రియుడు అయిన ఆశిష్ పాండే సాయంతో బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి ఓ రోజు భర్తకు పెట్టింది. ఆ తరువాత సంగీతా మీనా, ఆమె ప్రియుడు ఆశిష్ పాండే కలిసి సుత్తి, కర్రలు తీసుకుని నిద్రమత్తులో ఉన్న ధనరాజ్ మీనా తలపై చితకబాదడంతో.. ధనరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త మృతదేహాన్ని మాయం చేయడానికి సంగీత, ప్రియుడు ఆశిష్లు పలు రకాలుగా ప్రయత్నాలు చేసారు. పోలీసులకు దొరికిపోతామని అనుకుని.. గోనేసంచిలో మూటకట్టి.. కారు డిక్కిలో వేసుకుని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయారు. టెక్కి ప్రియుడు మోజు పడి కట్టుకున్న భర్తనే భార్య దారుణంగా హత్య చేయడం.. ఈ ఘటన మధ్యప్రదేశ్లో కలకలం రేకెత్తించింది.