ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి హృదయం చలించిపోతుంది అనే చెప్పాలి. ఓ దేవుడా ఎందుకు ఇలా చేసావు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్లెదుటే కన్నతల్లి అచేతనంగా పడి ఉన్న ఏమి జరిగిందో కూడా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కొడుకు. ఎందుకంటే అతడి మానసిక స్థితి బాగాలేదు. దీంతో 25 ఏళ్ల కొడుకు తల్లి గురించి పట్టించుకోకుండా గదిలో తనలో తానే మాట్లాడుకుంటూ మూడు రోజులు గడిపాడు.


 చివరకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఏమి జరిగిందని చూసేసరికి హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన రామ్ మోహన్, విజయ రాణి భార్య భర్తలు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేసే రామ్మోహన్ 2015 లో అనారోగ్యంతో మరణించాడు. భర్త మరణం తర్వాత బెంగళూరు నుంచి నగరానికి వచ్చినా విజయ రాణి తన కొడుకుతో కలిసి మల్కాజ్గిరి విమల దేవి నగర్ లోని మైత్రి నివాస్ అపార్ట్మెంట్ లో ఉంటుంది.


 అయితే బీటెక్ పూర్తి చేసిన వెంకట సాయి తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో స్నేహితులు బంధువులకు దూరం గా ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాడు. డిప్రెషన్లో పిచ్చి పిచ్చి గా ప్రవర్తించడం చేసేవాడు. అయితే కొడుకుపై ఇరుగుపొరుగు వారు ఆగ్రహం వ్యక్తం చేశారన్న కారణంతో అటు విజయ రాణి కూడా ఇరుగుపొరుగు వారితో మాట్లాడటం మానేసింది. ఇక ఇటీవలే విజయ రాణి ఉంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు  సమాచారం అందించారు పక్కింటి వాళ్ళు. పోలీసులు వచ్చి చెక్ చేయగా ఇక విజయ రాణి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. మరో గదిలో వెంకట సాయి తనలోతానే మాట్లాడుకుంటూ బిత్తరచూపులు చూస్తున్నాడు. ఇక వెంకట సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: