
ది లాన్సెట్ రీజినల్ హెల్త్ ఈ రిపోర్ట్ ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి డేటా ఆధారంగా .
ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం మన దేశంలో ఆడవారి కంటే మగవారే ఎక్కువ ఆత్మహత్యలకు పాలపడుతున్నారట. ఆడవారితో పోలిస్తే మగవారి ఆత్మహత్యల సంఖ్య 2.6 రెట్లు అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం గడిచిన ఏడేళ్లలో మన దేశంలో పురుషుల ఆత్మహత్యల సంఖ్య మూడింట ఒక వంతు పైగా పెరిగింది. ఈ నివేదిక ప్రకారం 2021 లో 45 వేల 26 మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడగా, మగవారిలో ఈ సంఖ్య 1,18,979 గా ఉంది. ఈ గణాంకాలు 2014 లో 42,521 (మహిళలు), 89,129 (పురుషులు) గా ఉన్నాయ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బలవన్మరణానికి పాల్పడిన పురుషులలో పెళ్లైన వారే ఎక్కువ. ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో ఎక్కువ మంది 30 నుంచి 44 ఏళ్ళ మధ్య ఉన్నవారే అని ఈ నివేదిక చెబుతోంది. వీరిలో రోజువారీ కూలీలు ఎక్కువ.
ఆత్మహత్యలకు గల కారణాలను కూడా ఈ నివేదిక వెల్లడించింది. పురుషులలో ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమహత్యకు పాల్పడుతున్నారట. ఐతే మహిళలలో ఆత్మహత్యలు తక్కువగా ఉండటానికి గల కారణమా వారి కోపింగ్ మెకానిజం కావచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ నివేదిక ప్రకారం 2014 తో పోలిస్తే 2021 లో పురుషులలో ఆత్మహత్యల సంఖ్య 33.4 శాతం పెరిగింది.