ఇక రాష్ట్రంలో 15వందల పాఠశాలలు మొత్తానికే తెరుచుకోలేదు. అద్దెలు కట్టకపోవడంతో బిల్డింగ్లను యజమానులు స్వాధీనం చేసుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలకు పిల్లలను పంపేందుకు చాలా మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడంతో కొందరు ఆన్లైన్ క్లాస్లకే మొగ్గు చూపుతున్నారు. సర్కారు తీరుపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. బస్సుల ఫిట్నెస్ విషయంలో సర్కార్ ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తున్నాయి. పాఠశాలలు 18 నెలలుగా మూతబడినా.. 10 నెలల టాక్స్ చెల్లించమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మినహాయింపులు ఇవ్వకుండా ప్రభుత్వం దోచుకోవడం ఏంటని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల తర్వాత విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలతో తల్లిదండ్రులు భయపడుతున్నారు.
ఇక రాష్ట్రంలో 15వందల పాఠశాలలు మొత్తానికే తెరుచుకోలేదు. అద్దెలు కట్టకపోవడంతో బిల్డింగ్లను యజమానులు స్వాధీనం చేసుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలకు పిల్లలను పంపేందుకు చాలా మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడంతో కొందరు ఆన్లైన్ క్లాస్లకే మొగ్గు చూపుతున్నారు. సర్కారు తీరుపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. బస్సుల ఫిట్నెస్ విషయంలో సర్కార్ ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తున్నాయి. పాఠశాలలు 18 నెలలుగా మూతబడినా.. 10 నెలల టాక్స్ చెల్లించమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మినహాయింపులు ఇవ్వకుండా ప్రభుత్వం దోచుకోవడం ఏంటని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల తర్వాత విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలతో తల్లిదండ్రులు భయపడుతున్నారు.