తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న వారు కోకొల్లలుగా ఉన్నారని చెప్పాలి. గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి ఎటువంటి ఉద్యోగ ప్రకటనలు లేకపోయేసరికి అభ్యర్థులు సైతం ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే అలంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే శుభవార్త అందించింది. ఇప్పుడు ఏపీలో కూడా నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది జగన్ సర్కారు. ప్రభుత్వ అధ్వర్యంలో జాబ్ చేయాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. అనంతపూర్ జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(GGH)లో కాంట్రాక్ట్ బేస్ పై ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.

కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకై తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వం. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆసక్తికర అభ్యర్దులు అప్లై చేసేయండి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు  హాజరు అయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

* మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 18 గా ఉంది.

* అప్లై చేసుకోవాలనే అభ్యర్థులకు దరఖాస్తుకు చివరి తేదిని 2022 మార్చి 19 గా గడువు ఇవ్వడం జరిగింది.

* విద్యార్హత: పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ , పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

* అలాగే సంబంధిత పని విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. మరియు  ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండటం అవసరం.

* వయోపరిమితి: ఈ జాబ్ కు అప్లై చేసుకునే అభ్యర్దులు 42 ఏళ్ల వయస్సుకు మించరాదు.

*ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు .

* వేతనం వివరాలు: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు కేడర్ ను బట్టి జీతం నెలకు రూ. 12000 నుంచి రూ.37100 వరకు వేతనం చెల్లిస్తారు.

పైన ఇచ్చిన ఉద్యోగ వివరాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా అనంతపురం GGH ను సందర్శించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: