మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. కాగా ఇటీవలే రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయ్యింది.. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ పాత్ర లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ లుక్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. మొన్నటివరకు మోషన్ పోస్టర్ నే రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ లుక్ రిలీజ్ చేయడంతో సినిమాపై హైప్ ని ఒక్కసారిగా పెంచింది..

ఇక ఈ సినిమా తో పాటు చిరు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అవి రీమేక్ సినిమాలే కాగా చిరుకి తగ్గ మెరుపు లు తెలుగులో చేయబోతున్నాడట.. ఈ రెండు సినిమాల్లో మొదట మలయాళ సినిమా లూసిఫర్ ని తెరకెక్కిస్తున్నారు.. మోహన్ రాజా దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఆచార్య తర్వాత సెట్స్ మీదకు వెళ్లబోతుంది. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరున్న మోహన్ రాజాసినిమా ను తనదైన శైలి లో తెరకెక్కించబోతున్నాడట.. రామ్ చరణ్ నటించిన ధృవ సినిమా ని తమిళ్లో తని ఒరువన్ పేరుతో తెరకెక్కించండి మోహన్ రాజానే..

 ఇక  అసలు విషయానికి వస్తే ఇందులో నయనతార ఉండటం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెబుతున్నారు. మాములుగా నయన్ ఈ మధ్య తెలుగు సినిమాలు పెద్దగా ఒప్పుకోవడం లేదు. మెగా స్టార్ కోసమే ఈ  సినిమా చేస్తుందని చెప్పొచ్చు.. మలయాళంలో మంజు వారియర్ చేసిన క్యారెక్టర్ తనతో చేయించబోతున్నట్టు టాక్ ఉంది. అయితే అది హీరోకు సోదరి వరసలో ఉంటుంది. మరి ఆడియన్స్ అలా రిసీవ్ చేసుకోగలరా అనేదే పెద్ద అనుమానం. అయితే మోహన్ లాల్ కు అక్కడ లేని హీరోయిన్ పాత్రను ఇక్కడ సృష్టించారని, అదే నయనతార చేస్తుందని మరో వార్త కూడా ప్రచారంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: