టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ హీరోగా శృతి సోది హీరోయిన్ గా తెరకెక్కిన పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది, ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సాయి ధరమ్ తేజ్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా సుప్రీమ్ సినిమాను తెరకెక్కించాడు,  ఈ సినిమాలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమాలో హీరోయిన్ అయినా శృతి సోది తో ఒక స్పెషల్ సాంగ్ లో చేయించాడు, సుప్రీమ్ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి, రవితేజ హీరోగా మెహరిన్ హీరోయిన్ రాజా ది గ్రేట్ సినిమా తెరకెక్కించాడు, ఈ సినిమాలో సుప్రీమ్ సినిమా హీరోయిన్ రాశి కన్నా  కనిపిస్తుంది.

అయితే ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎఫ్ టు, ఈ  సినిమాలో రాజా ది గ్రేట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మెహరీన్ కూడా ఒక హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కించాడు, ఈ సినిమాలో ఎఫ్ టు మూవీ లో  హీరోయిన్ గా నటించిన తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది, ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా ఎఫ్ త్రీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు,  అయితే ఈ సినిమాలో సరిలేరు నీకెవ్వరు మూవీ లో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన తీసుకురావాలని దర్శకుడు అనిల్ రావిపూడి అనుకుంటున్నారట, ఇలా మొదటి నుండి తన సినిమాలకు వస్తున్న సెంటిమెంట్ ను ఈ సినిమాతో కూడా అనిల్ రావిపూడి ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: