ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కార్యక్రమం బుల్లి తెర పై ఎంత పాపులారిటీ సంపాదించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది కమెడియన్ కు లైఫ్ ఇవ్వడమే కాదు... ఇక బుల్లితెర కామెడీ షో లో సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది ఈ కార్యక్రమం. అయితే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ తో గెటప్ శ్రీను కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. సుడిగాలి సుధీర్ టీం లో ఉండే గెటప్ శ్రీను మొదటి నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.


 సాధారణంగా కామెడీ పంచ్ లతో కంటే ప్రత్యేకమైన గెటప్ లతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే శ్రీను కాస్త గెటప్ శ్రీను గా మారిపోయాడు. అయితే గత కొంత కాలం క్రితం జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. గెటప్ శ్రీను తో పాటు సుడిగాలి సుదీర్ కూడా నుంచి తప్పుకొని స్టార్ మా లో ఒక కార్యక్రమానికి యాంకర్ గా కూడా పని చేస్తున్నాడు. కానీ గెటప్ శ్రీను మాత్రం ఏ చానల్లో కనిపించ లేదు అన్న విషయం తెలిసిందే. ఇక సినిమాలతో బిజీగా ఉండటం కారణంగానే గెటప్ శ్రీను జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు అన్నది మాత్రం అర్థమైంది. సుధీర్ గెటప్ శ్రీను వెళ్ళిపోవడంతో తాను ఒంటరివాడిని అయిపోయాను అంటూ ఆటో రాంప్రసాద్ ఎన్నోసార్లు బాధ పడ్డాడు.


 ఇకపోతే ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో చూసుకుంటే గెటప్ శ్రీను మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు అని అర్థమవుతుంది. ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక రాంప్రసాద్ స్కిట్ చేస్తుంటే గెటప్ శీను ఎంట్రీ  ఇచ్చాడు. దీంతో ఇంద్రజ చెప్పడంతో ఇక ఆ స్కిట్ అక్కడితో ఆపేసి మరో కొత్త స్కిట్ తో గెటప్ శ్రీను తో కలిసి చేశారు. మావాడు బుల్లితెర కమలహాసన్ అంటూ అన్నపూర్ణమ్మకు చెబుతాడు రాంప్రసాద్. మీవాడు కమల్ హాసన్ లా నటిస్తే కమలహాసన్ టీవీ ముందు కూర్చుని పల్లీలు తింటాడా అంటూ శ్రీను పరువు తీసింది. గెటప్ శ్రీను ని ఇమిటేట్ చేస్తూ మరింత పరువు తీసేసింది అన్నపూర్ణమ్మ.. దీంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: