
ఇప్పటివరకు సీఎం చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చినప్పటి నుంచి 71 సార్లు హైదరాబాద్ వెళ్లి వచ్చాడు అన్న వార్తే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా టీమ్ విపరీతంగా ఎక్కిపడుతున్నారు. చిన్న విషయాన్ని పెద్ద రాధాంతంగా చేసి, చంద్రబాబును వెటకారంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. నారా లోకేష్ కూడా ఎక్కువసార్లు హైదరాబాద్ వెళ్ళడం వెనుక కారణం ఏమిటో అంటూ అపోజీషన్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇది మరింత హైలైట్ అయ్యింది.
ఇక అదే సమయంలో, జగన్ కూడా ఇలాంటి విమర్శలకు గురయ్యాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల సీఎం జగన్ ప్రతి రెండు రోజులకు ఒకసారి బెంగళూరుకు వెళ్తున్నాడని, అది ఏ పనిమీద అనేది చెప్పలేకపోతున్నాడని, సోషల్ మీడియాలో ఒక వర్గం ట్రోల్స్ విపరీతంగా చేశాయి. జగన్పై ఆ రోజుల్లో విపక్ష మీడియా, ప్రతిపక్ష నేతలు కలిసి నిప్పులు చెరిగేలా మాటల దాడి చేశారు. ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబును కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో ఈ రెండు విషయాలు ఒకేసారి హాట్ టాపిక్ అయ్యాయి. ఒకవైపు జగన్ బెంగళూరు వెళ్తే “అది తప్పు ” అని వ్యంగ్యంగా చెప్పేవాళ్లు, ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ వెళ్తే “ఇది ఏ పనిమీద?” అని అదే విధంగా వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు అభిమానులు కూడా సైలెంట్గా లేకుండా, జగన్పై కౌంటర్లు వేస్తున్నారు. ఇలా జగన్ వర్సెస్ చంద్రబాబు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మరింత హీట్ పెంచుకుంది. రాజకీయ వర్గాల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే డిబేట్ నడుస్తోంది. పాలిటిక్స్ అంటే అంతే ఒక చిన్న ఇష్యూ కూడా ఎలా పెద్దదిగా మారిపోతుందో, ఎలా పాపులర్ ట్రెండ్గా మారుతుందో దీనివల్ల మరోసారి బయటపడింది.