బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది యాంకర్ అనసూయ.మొదట న్యూస్ ఛానల్ లో తన కెరియర్ను ప్రారంభించిన ఈమె దాని అనంతరం జబర్దస్త్ షో కి యాంకర్ గా రావడం జరిగింది. జబర్దస్త్ షో మొదలు పెట్టినప్పటి నుండి యాంకర్ గా కొనసాగుతున్న ఈమె జబర్దస్త్ షో తోనే తన హవా కొనసాగించింది. అయితే గత కొద్ది నెలల క్రితం స్టార్ మా నిర్వహించిన షోలతో బిజీగా మారింది అనసూయ. అయితే ఎవరు ఊహించిన విధంగా ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు.అయితే 1985 నా జన్మించిన ఈమె దాని అనంతరం వివాహం చేసుకుంది. 

హైదరాబాదులోని బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె అప్పటినుండే మీడియాలో ఏదో ఒక పని చేయాలి అని ఎంతో ఆసక్తితో ఉండేది. గతంలో ఈమెకి మొట్టమొదటిసారిగా వెండితెరపై ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో కనిపించే అవకాశాన్ని తగ్గించుకుంది. ఇక అప్పట్లో ఈ సినిమాలో నటించినందుకు గాను అనసూయ 500 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంది. దాని అనంతరం సాక్షి టీవీలో న్యూస్ రీడర్గా చేసింది. న్యూస్ రీడర్గా చేస్తూనే ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా తెచ్చుకుంది అనసూయ. దాని అనంతరం జబర్దస్త్ షో ద్వారా

 యాంకరింగ్ ను మొదలుపెట్టిన ఈమె జబర్దస్త్ తో పాటు మాటీవీ జీటీవీ ఇలా ఎన్నో ఛానల్ లో యాంకరింగ్ గా చేసిందిమ్ ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో మొదటి స్థానంలో ఉన్న సుమ తర్వాత అంతటి పాపులారిటీని గుర్తింపును దక్కించుకుంది అనసూయ. చాలా సంవత్సరాల నుండి జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతూ తిరుగులేని యాంకర్ గా కూడా మంచి గుర్తింపును పొందింది. ప్రస్తుతం ఈమె సినిమాలలో నటించడమే కాకుండా కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ లలో కూడా నటిస్తుంది. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అందరినీ మెప్పించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: