గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పలు ప్రాంతాలలో కొంతమంది మహిళలు ఆటోలను అద్దెకు తీసుకొని నడుపుకుంటున్నట్లుగా తెలియడంతో ఇకపై వారు అలాంటివి ఏమి చేయకుండా సొంత ఆటోలను నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయాన్ని పొందేలా ఏపీ సీఎం ఆలోచించి వీరి కోసం మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించారట. ఈ పథకంలో ఆటోను కొన్న వారికి అయ్యే ఖర్చుల 10 శాతం లబ్ధిదారి అయిన మహిళలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 90 శాతం అంతా కూడా స్పేర్స్ ద్వారా ప్రత్యేకమైన రుణాన్ని అందిస్తారట తీసుకున్న రుణానికి కూడా వడ్డీ ఉండదట.
డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లబ్ధిదారులకు కొత్త ఆటోలను అందజేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరి కల్లా లబ్ధిదారులను పూర్తి చేసి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న కొత్త ఆటోలను మహిళలకు అందించే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహిళలకు తాము తీసుకున్న మొత్తం మరణాన్ని 48 నెలల లో చెల్లింపు చేసే అందుబాటు కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మంది ఈ కార్యక్రమం ద్వారా చేయూతను అందిస్తున్నారట. ఇప్పటికే 20030 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది వారికి డ్రైవింగ్లో శిక్షణతో పాటు భద్రత లోపాలను కూడా వివరించే విధంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి