టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల
సైరా నరసిమహారెడ్డి సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ ఒక స్వతంత్ర సమరయోదుడిగా నటించిన ఈ సినిమాను ఆయన కుమారుడు
రామ్ చరణ్ నిర్మించగా,
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
అక్టోబర్ 2న
గాంధీ మహాత్ముని జయతి సందర్భంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ
సినిమా మాత్రం ఓవర్ అల్ గా యావరేజ్ గా నిలిచింది. సినిమాలో
మెగాస్టార్ నటన, సెట్స్, విజువల్స్ మాత్రమే బాగున్నాయని, అయితే కథ, మరియు కథనాలు మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేవని మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరిచారు.
ఇకపోతే దీని తరువాత
మెగాస్టార్ నటించబోయే 152వ
సినిమా అధికారిక
పూజా కార్యక్రమాలు ఇటీవల జరుగగా, ఆ సినిమాలో నటించబోయే
హీరోయిన్ మరియు
సంగీత దర్శకుడి విషయమై కొద్దిరోజలుగా
మీడియా మాధ్యమాల్లో పలు వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. వాటి ప్రకారం, తన ఆస్థాన
సంగీత దర్శకుడైన
దేవిశ్రీప్రసాద్ ను ఈ సినిమాకు
కొరటాల తీసుకునే అవకాశం చాలావరకు లేదట. దానికి కారణం ఆయనకు డేట్స్ ఖాళీగా లేకపోవడమే అంటున్నారు. కావున ఆయన స్థానంలో వేరొక
సంగీత దర్శకుడిని తీసుకునే అవకాశం కనపడుతోంది. ఇకపోతే ఈ సినిమాలో
హీరోయిన్ గా
నయనతార మరియు త్రిషల పేర్లు ఇటీవల ప్రచారం అయ్యాయి.
అంతేకాక నిన్నటి నుండి ఈ సినిమాలో మన తెలుగు
అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఫిలిం
నగర్ వర్గాల నుండి అందుతున్న వార్తల ప్రకారం, వీరెవరూ కూడా
మెగాస్టార్ సరసన
హీరోయిన్స్ గా సెలెక్ట్ కాలేదని ఆ
సినిమా యూనిట్ తేల్చేసిందట. అంతేకాక తమ సినిమాలోని నటీనటుల, మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో అధికారికంగా తెలియపరుస్తామని
సినిమా యూనిట్ చెప్తోందట. దీనితో ప్రస్తుతం ఈ
సినిమా విషయమై ప్రచారం అవుతున్న వార్తలకు కొంతవరకు
చెక్ పడ్డట్లైంది....!!