టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వచ్చిన తరువాత మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించిన యువ హీరో విజయ్ దేవరకొండ, ఆ తరువాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారడం జరిగింది. ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని హీరోగా విజయ్ కెరీర్ కి మంచి పునాదులు వేసింది అనే చెప్పాలి. ఇక దాని తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా, అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు విజయ్ కు ఒక క్రేజీ స్టార్ గా విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. 

 

ఇక దాని అనంతరం పరశురామ్ దర్శకత్వంలో రష్మిక తో కలిసి విజయ్ నటించిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో విజయ్ దేవరకొండకు యూత్ మరియు లేడీస్ లో విపరీతమైన క్రేజ్ పెరగడంతో పాటు అతడికి టాలీవుడ్ లో మంచి స్టార్ హీరో స్టేటస్ లభించింది. ఇక అక్కడినుండి ఆయన నటించిన కొన్ని సినిమాలు రిలీజ్ అయి, పెద్దగా సక్సెస్ కానప్పటికీ, ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాల్లో ఏదో ఒక్కటి మంచి సక్సెస్ సాధిస్తే చాలు, విజయ్ కు వాటితో మరింత మంచి పేరు రావడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇకపోతే మొన్న బాలీవుడ్ లో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్ లో దీపికా పడుకొనే

 

మనోజ్ బాజ్ పాయి, రణ్వీర్ సింగ్, విజయ్ సేతుపతి తదితర ఇతర నటులతో కలిసి ఎంతో సందడి చేసిన విజయ్, అక్కడి కొన్ని టెలివిజన్ ఛానల్స్ కు ఇంటర్వూస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ దిగ్గజ నటులతో పాటు విజయ్ ని కూడా వారు ప్రత్యేకంగా ఆహ్వానించడానికి కారణం హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ అద్భుత విజయాన్ని అందుకోవడమే అని తెలుస్తోంది. నిజానికి అక్కడ ఇప్పటివరకు ఒక్క హిందీ సినిమా కూడా చేయని విజయ్ కి అటువంటి దిగ్గజ నటులతో కలిసే ఛాన్స్ రావడం గొప్ప విషయం అని, ఒకరకంగా ఇటువంటి ఛాన్స్ ఇప్పటివరకు మరే స్టార్ హీరోకు కూడా దక్కలేదని, ఈ విధంగా అతడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరినీ వెనక్కినెట్టినట్లే అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: