పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో లాయర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తుండగా, నివేత థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత అతి త్వరలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించబోయే పీరియాడికల్ మూవీ లో పవన్ నటించనున్నారు. రాబిన్ హుడ్ తరహా గజదొంగ పాత్రలో పవన్ నటించనున్న ఈ సినిమాని నిర్మాత ఏఎమ్ రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. 

 

ఇకపోతే ఈ రెండు సినిమాల తరువాత మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాని ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవి లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దర్శకుడు హరీష్, మంచి పవర్ఫుల్ స్టోరీని రెడీ చేసే పనిలో ఉన్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోనున్నట్లు టాక్. 

 

గతంలో సూపర్ స్టార్ మహేష్ సరసన భరత్ అనే నేనులో హీరోయిన్ గా నటించి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కియారా, ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. ఇక ఈ సినిమాలో పవన్ కు జోడిగా సరిగ్గా కిర్యరా అయితేనే బాగుంటుందని భావించిన దర్శకుడు హరీష్ ఆమెను తీసుకోవడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక మరికొద్దిరోజుల్లోనే ఈ సినిమా విషయమై కియారను సంప్రదించనున్నాడట దర్శకుడు హరీష్. మరి ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ కనుక నిజమే అయితే మాత్రం కియారకు మరొక గొప్ప ఛాన్స్ దక్కినట్లే....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: