సినీ రంగంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇతర రంగాలకు చెందిన వారి వారసులు ఈజీగా ఎంట్రీ ఇస్తున్నారు.  అయితే నటనపై ఎలాంటి అనుభవం లేకున్నా తమ బ్యాగ్ గ్రౌండ్ తో ఊదరగొడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారు ఎలాంటి కష్టం లేకుండానే పెద్ద సినిమాల్లో నటిస్తూ పెద్ద స్టార్ట్ పిలిపించుకుంటున్నారు. కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలీ కూడా స్టార్ కిడ్స్ పై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఎంతో మంది ప్రస్తుతం ఈ విమర్శల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. స్టార్ కిడ్స్ గా పరిచయం అయినా కూడా తమ ట్యాలెంట్ తో తమను తాము నిరూపించుకున్న తర్వాత కూడా ఇంకా స్టార్ కిడ్స్ అంటూ విమర్శలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇక చిన్న నటుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని.. తమకు ఎంత టాలెంట్ ఉన్నా పెద్దవారు తమను తొక్కేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు స్పందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 

స్టార్ కిడ్ అవ్వడం వల్ల నాకు ఇండస్ట్రీలో పెద్దగా ఇబ్బందులు పడకుండా అవకాశాలు వచ్చిన మాట నిజమే. కానీ ఇప్పుడు ఎవరికీ ఛాన్సులు అంత సులభంగా రావు.. ఒకప్పుడు నటనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.. ఇప్పుడు అదే కొనసాగుతుంది.  ప్రేక్షకులు టాలెంట్ ఉన్నవారికే పట్టం కడుతున్నారు.. అది చిన్నవారైనా పెద్దవారైనా.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ లో నటించినా పెద్దగా అవకాశాలు రావడం లేదు.  స్టార్ కిడ్స్ అంటూ నన్ను విమర్శించే వారిని నేను తప్పుబట్టను. ఎందుకంటే ఎంతో టాలెంట్ ఉండి నటులు కావాలన్న తాపత్రయంతో ఎంతో మంది స్టూడియో అవతల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  

 

అలాంటప్పుడు మాకు ఛాన్స్ వచ్చిందంటే కొందరు విమర్శలు చేయడం సహజం అన్నారు.  ఇక సినిమాల్లో రాణించాలంటే కోట్ల మందిని ఇంప్రెస్ చేయాలి.. అలా చేయలేని వారు ఎంతో మంది కనుమరుగైన స్టార్ కిడ్స్ కూడా ఉన్నారని కుండ బద్దలు కోట్టినట్లు మాట్లాడింది.   ఛాన్స్ ఈజీగా వచ్చిన స్టార్ డం మాత్రం అంత ఈజీగా రాదని.. దాని కోసం చాలా కష్టపడాలని.. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తించాలని జాన్వీ కపూర్ ఆ ఇంటర్వ్యూ లో కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: