టాలీవుడ్ లో కరోనా కారణంగా నష్టపోయిన నిర్మాతలు ఇప్పుడు ఖర్చు తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాలను ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో అయినా సరే ఆలోచించే పెట్టుబడి పెట్టాలి అని భావిస్తున్నారు. ఇక నిర్మాతల బాధలు విన్న దర్శకులు కూడా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు. కరోనా తర్వాత సినిమా బిజీ అవుతుంది. కాని సినిమా మాత్రం ఇంత ఖర్చు పెట్టే విషయంలో అంతే ఖర్చు పెట్టాలి అని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఉందీ అనేది వాస్తవం. 

 

ఇక టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త హీరోయిన్స్ కి అవకాశాలు ఇచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు. కథ బాగుంది అనుకుంటే ఒకటికి వంద సార్లు ఆలోచించ ఓకే చేసే హీరోయిన్స్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా దూకుడుగా ఆఫర్ వచ్చిన వెంటనే ఓకే చేసే పరిస్థితిలో ఉన్నారు అనేది వాస్తవం. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు టిక్ టాక్ లో హడావుడి చేసే హీరోయిన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు దర్శక నిర్మాతలు. వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని అందంగా ఉండే హీరోయిన్ తమ సినిమాలో తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అన్వేషణ మొదలు పెట్టారు కొందరు నిర్మాతలు. 

 

హీరోయిన్స్ అనే వాళ్ళు సినిమాకు ఇప్పుడు భారం అవకుండా ఉండాలని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలను చెయ్యాలని చూస్తున్నారు. టిక్ టాక్ లో చాలా మంది అందంగా ఉంటారని కాబట్టి వాళ్ళను సినిమాలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. తెలుగు అమ్మాయిలూ చాలా మంది అవకాశాల్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. దీనితో వాళ్లకు అవకాశం ఇస్తే రేట్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఎవరు అవకాశం దక్కించుకుంటారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: