టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ఇటీవల మలయాళం లో సూపర్ హిట్ కొట్టిన మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించనున్నారు. 

 

ఇటీవల ఈ సినిమా హక్కులను మంచి ఫాన్సీ ధరకు ఆయన తనయుడు రామ్ చరణ్ కొనుగోలు చేయడం జరిగింది. గత ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో వంటి భారీ యాక్షన్ మూవీని తీసిన యువ దర్శకడు సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు రావడం జరిగింది. ఇక ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి, కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు చెప్తున్నారు. రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తీయడం జరిగింది. 

IHG

 

ఆపై ఎన్టీఆర్ తో జై లవకుశ, అలానే వెంకటేష్, నాగ చైతన్య కలయికలో వచ్చిన వెంకీ మామ సినిమాలు తీసిన బాబీకి మెగాస్టార్ ని దర్శకత్వం వహించే అవకాశం లభించినట్లు చెప్తున్నారు. ఇప్పటికే గత కొద్దిరోజులుగా మెగాస్టార్ తో బాబీ సినిమా పక్కాగా కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు రావడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం బాబీ కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. మంచి ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్టైనర్ ఫార్మాట్ లో తెరకెక్కబోయే ఈ సినిమాతో బాబీ తన అభిమాన మెగాస్టార్ కి తప్పకుండా మంచి హిట్ ఇస్తాడని చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: