కోలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ మల్టీ తెలుగు స్టార్స్ మీద కన్నేశాడు. తమిళంలో ఇళయదళపతి విజయ్ తో వరుస సినిమాలుచేస్తూ హిట్లు కొడుతున్న అట్లీ తెలుగులో ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తమిళ సినిమా ప్రమోషన్స్ కు హైదరాబాద్ రావడం ఇక్కడ స్టార్స్ ను కలిసి లైన్ వినిపించడం చేస్తున్న అట్లీ ఈసారి ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకునే వెళ్తాడని తెలుస్తుంది. అట్లీ డైరెక్ట్ చేసిన మెర్సల్ సినిమాకు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇప్పుడు అట్లీతో ఎన్టీఆర్ కాంబినేషన్ కూడా ఆయనే సెట్ చేస్తున్నారని తెలుస్తుంది. 

 

ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్న తారక్సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్ ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాను 2021 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక అట్లీతో ఎన్టీఆర్ మూవీ ఫిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ మాత్రం త్వరలోనే వస్తుందట. లాస్ట్ ఇయర్ బిగిల్ సినిమాతో విజయ్ కు మరో హిట్ ఇచ్చిన అట్లీ త్వరలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. 

 

అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు కానీ బాలీవుడ్ సర్కిల్స్ లో కూడా షారుఖ్, అట్లీ సినిమా మీద వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు తమిళ సినిమాలతో అలరించిన అట్లీ ఇప్పుడు హిందీలో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. బాలీవుడ్ లో కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని షారుఖ్ ఖాన్ అట్లీ డైరక్షన్ లో చేసే సినిమాతో అయినా హిట్టు కొడతాడేమో చూడాలి. సినిమా సెట్ అయితే కనుక తెలుగు, తమిళ భాషల్లో కూడా షారుఖ్ సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. షారుఖ్ సినిమా హిట్టు కొడితే ఎన్టీఆర్ తో మూవీ లైన్ క్లియర్ అయినట్టే లెక్క.  

మరింత సమాచారం తెలుసుకోండి: