టాలీవుడ్ లో మెగాస్టార్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్. మొదటి నుంచి తనదైన విఫరెంట్ మానరీజంతో ఫైట్స్, యాక్షన్, కామెడీ ఎందులో అయినా సరే ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు పవన్ కళ్యాన్. త్రివిక్రమ్ - పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీ అయ్యారు పవన్ కళ్యాన్. ఏపిలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాన్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు.. ఒకేసారి మూడు సినిమాలు వరుస పెట్టారు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రిమేక్ చేస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా ఈ మూవీ రూపొందుతుంది.
దాదాపు షూటింగ్ పూర్తి అవుతుందీ అనుకున్న సమయంలోనే మాయదారి కరోనా రావడంతో అన్నీ క్యాన్సల్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో హైలెట్ సీన్ కోర్టు సన్నివేశం.. ఇందుకు ప్రత్యేకంగా సెట్స్ వేశారు.. అయితే పవన్ కళ్యాన్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొని ఎంత కష్టపడ్డారో స్వయంగా దర్శకులు వేణు చెప్పారు. కోర్టు సన్నివేశాలను చిత్రీకరించాలనుకున్నప్పుడు పవన్ తన రాజకీయ పార్టీ పనులతో బిజీగా ఉన్నారట. అందువల్ల 22 రోజుల పాటు రాత్రివేళల్లో షూటింగ్స్ చేశారట. ఆయనకు రెండు విధాలుగా ప్రవర్తించడం రాదని చెప్పుకొచ్చాడు.
షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే చాలు పుస్తకాలు చదువుతూ ఉంటారని కానీ మేము ఆయనకు ఆ సమయాన్ని ఇవ్వలేదని తెలిపాడు. పవన్ కళ్యాణ్ అసలు క్యారవ్యాన్లోకి వెళ్లేవారు కాదు చకచకా సీన్స్ తీసేవారమని తెలిపాడు. పవన్ పగలంతా మీటింగ్స్, రాత్రి సమయాల్లో షూటింగ్స్లో పాల్గొన్నారట. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పవన్ లాంటి గొప్ప హీరోకి ఇంత డెడికేషన్ ఉంటడం గర్వించదగ్గ విషయం అంటూ తెగ మెచ్చుకున్నాడు.