తెలుగు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్నటి సంక్రాంతి సందర్భంగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. ముందుగా భరత్ అనే నేను, అనంతరం మహర్షి, ఆపై సరిలేరు, ఇలా వరుసగా మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్, వీటి అనంతరం తన నెక్స్ట్ మూవీ ని గీతగోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. కాగా నేడు మహర్షి సినిమా రిలీజ్ అయి ఏడాది కావడంతో, ఆ సక్సెస్ఫుల్ సంబరాన్ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ మహర్షి యూనిట్ కి, ముఖ్యంగా తమ హీరో సూపర్ స్టార్ మహేష్ కు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నారు. 

 

ఇకపోతే మహేష్ నటించబోయే పరశురామ్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం అయిందని సమాచారం, ఇటీవల స్క్రిప్ట్ లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసిన పరశురామ్, సినిమాని పక్కా ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై ఎప్పటినుండో పలు టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ముందుగా పూజ హెగ్డే, ఆ తరువాత కియారా అద్వానీ, ఆపై శ్రద్ధ కపూర్, ఇటీవల కీర్తి సురేష్, ఇలా దాదాపుగా చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి రావడంతో అసలు ఈ సినిమాలో ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. కాగా మూడు రోజుల క్రితం ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు రావడం జరిగింది. 

 

అయితే నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే, ఈ సినిమాలో కేవలం కీర్తి సురేష్ మాత్రమే కాక, కియారా అద్వానీ కూడా మరొక హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఒక హీరోయిన్ మొదటిభాగంలో మరొక హీరోయిన్ రెండవ భాగంలో వస్తుందని అంటున్నారు. కాగా మొత్తంగా రెండు పాత్రలకు గాను కీర్తి మరియు కియారాలను ఎంపిక చేసిందట సినిమా యూనిట్. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, కొంత గ్యాప్ తరువాత మరొక్కసారి సూపర్ స్టార్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను చూడవచ్చన్నమాట......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: