సౌత్ సినీ అభిమానులకు చెయ్ - సామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన జంట నాగచైతన్య - సమంత. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌ గా సమంత- నాగ చైతన్య నిలిచారు. ఇద్దరూ కలిసి 'ఆటో నగర్ సూర్య' 'మనం' 'మజిలీ' చిత్రాల్లో నటించారు. సమంత నటించిన 'ఓ బేబీ' సినిమాలో చైతూ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా వీరిద్దరికీ సంబంధించిన వార్తల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ జంట ఎప్పటికప్పుడు తమ ఫోటోలు ఫ్యాన్స్‌కి షేర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత తరచు తమ ఫోటోలని షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. 

 

సమంత లాక్‌ డౌన్ పీరియడ్‌ లో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన సమంత.. ఇంట్లో భర్త నాగ చైతన్యతోపాటు.. పెట్ డాగ్ హ్యాష్ తో ఆడుకుంటోంది. అంతేకాదు ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఆన్‌లైన్‌లో తన ట్రైనర్ సందీప్ రాజ్ సూచనలు తీసుకొని ఫిట్‌గా తయారయ్యే పనిలో పడింది. తాజాగా తన భర్తతో కలిసి కారులో షికారుకు వెళుతున్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా బైక్ పై తన భర్త నాగ చైతన్యతో షికారుకు వెళుతున్న ఫోటోను షేర్ చేసింది. దీనికి బ్రెడ్ ఎమోజీని క్యాప్షన్‌గా జత చేసింది. నాగ చైతన్య హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండగా సామ్ మరో హెల్మెట్ పట్టుకొని వెనుక కూర్చొని ఉంది. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు మాత్రం లాక్ డౌన్ వేళ చెయ్ - సామ్ ఎక్కడికి పోతున్నారో అని తెగ అందోళన చెందుతున్నారు. కాకపోతే ఇది త్రో బ్యాక్ పిక్ అయ్యుండొచ్చు. ఎందుకంటే లాక్ డౌన్ లో ఇలా బయట తిరిగే పరిస్థితి లేదు. అందులోనూ ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్లే ఛాన్స్ లేదు. సో ఇది ఖచ్చితంగా ఓల్డ్ ఫోటో అయ్యుంటుంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🍞

A post shared by samantha Akkineni (@samantharuthprabhuoffl) on

మరింత సమాచారం తెలుసుకోండి: