ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉండటంతో సినిమా థియేటర్లు మొత్తం మూసివేయబడిన విషయం తెలిసిందే. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో సినిమాలు ఇబ్బందుల్లో పడిపోయాయి. ఆయా నిర్మాతలందరూ నష్టాల్లో కూరుకు పోతున్నారూ. దీంతో  సినిమా దర్శక నిర్మాతలందరూ టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తెరుచుకుంటుంది అన్న ఆశ కూడా ఎవరు లేదు . దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు అన్నింటిని  ఓటిటి  డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా విడుదల చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. 

 

 ఇప్పటికే దీనికి సంబంధించి కొంత మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఆన్లైన్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో ఏకంగా ఏడు సినిమాలూ  విడుదల చేయనున్నట్లు దర్శకునిర్మాతప్రకటించారు. అయితే ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమా కూడా ఓటిటి  ద్వారా విడుదల చేసేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. త్వరలో రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమా ఓటిటి లో  విడుదల చేయబోతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 


 సినిమా అనేది కొందరికి ఫ్యాషన్ కానీ చాలామందికి వ్యాపారం... మిగిలినవారికి జూదం... వీళ్లు సినిమాని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు... అంటూ ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ పోస్ట్ కి హ్యాష్ ట్యాగ్, పోటీకి, థియేట్రికల్ ట్రైలర్ అంటూ ఇచ్చారు. దీంతో రామ్ హీరోగా నటించిన రెడ్  మూవీ కూడా ఓటిటి  విడుదలయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ని రామ్ విమర్శిస్తున్నారా  లేదా మద్దతు ప్రకటిస్తున్నారు అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: