సాధారణంగా మాజీ హీరోయిన్ లకు మన తెలుగులో మంచి క్రేజ్ ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా వారిని తీసుకోవడానికి కాస్త ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. నిన్నటి తరం హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన వారిలో రమ్యకృష్ణ, నగ్మా, రోజా, నదియా లాంటి వాళ్లు ఇప్పుడు అత్తలు, అమ్మల క్యారెక్టర్లు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల నుంచి అటు హీరోలు కూడా వారికి మంచి పాత్రలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు అన్నది నిజం. ప్రస్తుతం భూమిక, స్నేహ సహా కొందరు హీరోయిన్ లను అగ్ర హీరోల సినిమాల్లో తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారు దర్శక నిర్మాతలు.
భూమిక ఇప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోది. నాని ఎంసీఏ సినిమాలో నానికి వదినగా నటించిన ఆమె.. బాలయ్య రూలర్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో భూమికను తన సినిమాలో తీసుకోవడానికి మహేష్ బాబు, చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి ఒక కథ విన్నారని ఆ కథలో ఆయనకు ఒక పెంచుకునే కూతురు ఉంటుందని... ఆ పాత్ర కోసం భూమికను తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఇద్దరు హీరోల పాత్రలు ఉంటాయని... అందులో ఒక పాత్రకు కూతురుగా భూమిక నటించే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఆయన లూసిఫర్ సినిమా చేయకపోతే మాత్రం ఈ సినిమాను చేస్తారని అప్పుడు ఆమె గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మహేష్ బాబు కూడా ఆమెను తీసుకునే విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడట. ఆమె మహేష్ బాబు కి లక్కీ హీరోయిన్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా మీద ఫోకస్ పెట్టిన మహేష్ బాబు... పరుశురాం దర్శకత్వంలో చేసే సినిమాలో... మానసిక రోగిగా నటిస్తున్నాడని అంటున్నారు. అందులో డాక్టర్ గా భూమికకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.