సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న తదుపరి చిత్రం సర్కారు వారి పాట లో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ వచ్చింది. ఈసినిమా కోసం కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు ఎక్కువగా వినపడ్డాయి. ఫైనల్ గా కీర్తిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈవిషయాన్ని స్వయంగా కీర్తినే  వెల్లడించింది. కొద్దీ సేపటి క్రితం ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించిన కీర్తి  మహేష్ తో నటించనున్నానని కంఫర్మ్ చేసింది. మహేష్ తో నటించడం కీర్తి సురేష్ కు ఇదే మొదటి సారి. 
 
ఇక ఇటీవల ఈ సినిమా ప్రీ లుక్ విడుదలచేయగా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ ,లాంగ్ హెయిర్ తో మాస్ లుక్ లో కనిపించనున్నాడు. గీతగోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్  ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిచనున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు విధించిన నిబంధనల వల్ల ఈ సినిమా ఆలస్యంగా  సెట్స్ మీదకువెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇదిలావుంటే ప్రస్తుతం కీర్తి చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు వున్నాయి. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నాథే ఒకటి.  సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. మిగతావి తెలుగు సినిమాలు. అందులో భాగంగా నితిన్ నటిస్తున్న రంగ్ దే లో కీర్తి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.ఇక వీటితో పాటు కీర్తి, మిస్ వరల్డ్ , గుడ్ లఖి సఖి అనే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: