ఈసారి దసరా కు సినిమాలు విడుదల ఏమి లేకపోవడంతో టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్ వార్ మాత్రమే కొనసాగబోతోంది. దసరా పండుగ సందర్భంగా మెగా అభిమానుల కోసం ‘ఆచార్య’ టీజర్ ను విడుదల చేయబోతున్నారు.


జూనియర్ అభిమానుల కోసం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ కూడ ఇదే పండుగ సీజన్ లో విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ రేస్ లోకి ఎవరు ఊహించని విధంగా బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. గతంలో బాలకృష్ణ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘నర్తనశాల’ మూవీ కొంతవరకు షూటింగ్ జరుపుకుని సౌందర్య మరణంతో ఆగిపోయింది.


బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకునే ఈమూవీ మళ్ళీ ఎప్పటికైనా తీయాలని బాలకృష్ణ అభిప్రాయపడుతున్నాడు. ఇప్పుడు తన ఆశలకు తిరిగి జీవం పోసే విధంగా ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమాకు సంబంధించిన 17 నిముషాల సీన్స్ ను ఎడిట్ చేసి దానిని శ్రేయాస్ ఈటి ద్వారా ఎన్ బీ కే ధియేటర్ లోకి వెళ్ళి ఓటీటీ ద్వారా ఈ ‘నర్తనశాల’ ను చూడవచ్చు.


ఈ నెల 24వ తేదీ నుండి ‘నర్తనశాల’ హంగామా మొదలుకాబోతోంది. బాలకృష్ణ అర్జునుడుగా సౌందర్య ద్రౌపతి గా శ్రీహరి భీముడు గా శరత్ బాబు ధర్మరాజు గా నటించిన ఈమూవీలో బాలయ్య నట విశ్వరూపానికి సంబంధించిన కీలక సన్నివేశాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఎన్ బీ కే ధియేటర్ ద్వారా విడుదల కాబోతున్న ఈ వీడియో ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని  ఛారిటీకి ఇవ్వడానికి బాలయ్య నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఎన్ బీ కే ధియేటర్ ఆలోచనలు చూస్తుంటే అతడు కూడ త్వరలో ఓటీటీ బిజినెస్ లోకి వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. బాలయ్య ఆలోచనలు ఎలా ఉన్నా దసరా పండుగ సీజన్ లో హడావిడి చేయడానికి నందమూరి అభిమానులకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈ నందమూరి సింహం..

మరింత సమాచారం తెలుసుకోండి: