సమంతా అక్కినేని సోమవారం ఇన్‌ స్టాగ్రామ్‌ లో చేసిన తాజా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆమె  ‘ఎ లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్’ డాక్యుమెంటరీ చూడాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థించారు. భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తుండటంతో దీన్ని మాత్రం చూడకండ ఉండకందని ఆమె కోరారు. ఈ డాక్యుమెంటరీ పోస్టర్‌ను పంచుకున్న ఆమె, “ఎ లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్’ చూడాలని దయచేసి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను .. దీన్ని విస్మరించవద్దు. తరువాతి తరాల కోసం ... మీ భవిష్యత్తు కోసం .. మీ పిల్లల భవిష్యత్తు కోసం అంటూ ఆమె పేర్కొంది.

లాక్డౌన్ సమయంలో సమంతా కూరగాయలు పండిస్తూ తోటపని చేస్తూ గడిపేసింది. టెర్రస్ ఫామింగ్ చేసింది. ఇటీవల ఈ 33 ఏళ్ల నటి తన సొంత దుస్తుల బ్రాండ్ ని కూడా ప్రారంభించింది. ఇక ఆమె రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికె యొక్క ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండవ సీజన్లో టెర్రరిస్ట్ పాత్ర పోషించడంతో దాని మీద అంచనాలు ఉన్నాయి.

ఇక ఆమె నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ యొక్క కాతు వాకులా రేండు కదల్ అలానే మరియు అశ్విన్ శరవణన్ తో ఓ హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చేస్తోంది. అయితే ఈ మూవీని సమంత హోల్డ్‌లో పెట్టిందని అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య అనుష్క నటించిన నిశ్శబ్దం ఓటీటీలో విడుదల కాగా.. దానికి మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. అయితే అశ్విన్‌ దర్శకత్వంలో సమంత నటించాల్సిన పాత్ర కూడా అలాంటిదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌ లో పెట్టినట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: