టాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా చిరంజీవి ఇమేజ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవిసినిమా చేసినా సరే ప్రేక్షకులు మొదటిరోజు వెళ్లే సినిమా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమాలు వరుసగా చేస్తున్నారు. సినిమాలు విడుదల చేసే విషయంలో కూడా చిరంజీవి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి.

ఈ రెండు మూడు సినిమాలను కూడా దాదాపుగా నాలుగు ఏళ్ళ పాటు సమయం తీసుకుని ఆయన విడుదల చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆయన ఒక సినిమా చేసే అవకాశాలు ఉండవచ్చు అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక దర్శకుడిగా ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే దర్శకుడు ఎవరు ఏంటి అనేది తెలియక పోయినా దాదాపుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఈ సినిమాలో ఒక గ్రామ సర్పంచ్ గా చిరంజీవి నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన కొడుకుగా సాయి ధరం తేజ్ నటించవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కథను కూడా పరుచూరి బ్రదర్స్ ఇప్పటికే ఇచ్చినట్లుగా సమాచారం. అయితే సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారు ఏంటి అనేది తెలియకపోయినా ఈ సినిమాకు టైటిల్ గా సర్పంచ్ గారు అనేది పెట్టాలని లేదా ప్రెసిడెంట్ గారు అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీసుకొచ్చే విధంగా చిరంజీవి ప్లాన్ చేస్తున్నారట. మరి ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుందని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: