తెలుగు చిత్ర పరిశ్రమలో గంగోత్రి సినిమాతో పరిచయమైన నటుడు అల్లు అర్జున్. ఆయన వరస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అల్లు అర్జున్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎప్పడికప్పుడు స్టైలిష్ గా ఉండడంతో స్టైలిష్ స్టార్ గా పేరు పొందాడు. ఇక అల్లు అర్జున్ సంక్రాంతికి అల వైకుంఠపురంలోతో వచ్చి భారీ కమర్షియల్ హిట్ ని సాధించాడు. ఈ సినిమాతో తన సత్తా ఏమిటో నిరూపించాడు బన్ని. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని భారీగా పెంచేసింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 వచ్చిన సంగతి తెలిసిందే. పుష్పలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని తెలుస్తోంది.

సినిమా ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను చాలా వరకు కేరళ అడవుల్లో చిత్రీకరించాలనీ భావించారు దర్శక నిర్మాతలు. కానీ కరోనాతో ఆ ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యాయి. దీంతో రంపచోడవరం, ఆదిలాబాద్, వికారాబాద్ అడవుల్లో చిత్రీకరించాలనీ భావిస్తోందట చిత్రబృందం. ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ 20 నుండి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారని సమాచారం. సాయిపల్లవి పుష్ప చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు చెల్లెలుగా నటిస్తోందిని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కొంత స్పష్టత రావాల్సిఉంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: