ముఖ్యంగా హీరోల విషయంలో చాలా గమ్మత్తుగా ఇలాంటివి జరుగుతుంటాయి. అలనాటి హీరో రాంకీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈయన ‘సింధూరపువ్వు’ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్న రోజులవి. డైరెక్టర్ దేవరాజ్ ఆ చిత్రంలో హీరోయిన్ గా.. నిరోషాను తీసుకోవాలనుకుంటున్నట్టు అప్పుడు హీరో రాంకీకి చెప్పారట.
దానికి ఆయన ఆ హీరోయిన్ నచ్చక ఈమె హీరోయిన్ ఏంటండి.. పనిమనిషిలా ఉంది అంటూ దారుణంగా కామెంట్ చేశారు. అందుకు డైరెక్టర్ దేవరాజ్ నువ్వేమన్నా సరే.. ఈమెనే హీరోయిన్…! ఈ చిత్రం తర్వాత కచ్చితంగా ఈమె టాప్ హీరోయిన్గా ఎదుగుతుంది అంటూ రాంకీని ఒప్పించాడట దర్శకుడు.ఆయన చెప్పినట్టు గానే సినిమా సూపర్ హిట్ అయ్యింది.
రాధికా శరత్ కుమార్ చెల్లెలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిరోష ఆ తరువాత బాలకృష్ణతో ‘నారీ నారీ నడుమ మురారీ’,చిరంజీవితో ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ ,మణిరత్నం ‘ఘర్షణ’ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ని ఫ్యాన్స్ ని సంపాదించుకుంది.తరువాత హీరో రాంకీతో ఈమె కలిసి నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే..
ఆ సినిమాల షూటింగ్ల సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించడం.. తరువాత అది పెళ్లి వరకూ వెళ్లడం జరిగిందని తెలుస్తుంది.ఈ రకంగా సినిమాల్లోనే వద్దనుకున్న హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు రాంకీ..దీన్ని బట్టి మనకు అర్ధమవుతుంది ఏంటంటే విధి మనకు మొదట్లో నచ్చని వాళ్ళని కూడా మనకు దగ్గర చేసి ఒక్కటి చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.