పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరో 20 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందట. 2021 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా ఆ టైం కు ఆల్రెడీ వరుస సినిమాలు ఉన్నాయి అందుకే 2021 సమ్మర్ లో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో అదరగొట్టే రేటు పలికినట్టు తెలుస్తుంది.

పవర్ స్టార్ సినిమా అంటే రికార్డ్ రేటు పలకాల్సిందే. శాటిలైట్ రైట్స్ భారీ ధరకు సన్ నెట్ వర్క్ అదే జెమిని టివి సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈమధ్య ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో వెనకపడ్డ జెమిని మిగతా ఛానెల్స్ కు పోటీ ఇచ్చేందుకు కృషి చేస్తుంది. స్టార్ మా, ఈటివి, జీ తెలుగు ప్రేక్షలను ఎంటర్టైన్ చేయడంలో ముందున్నాయి. జెమినిలో రియాలిటీ షోలు కూడా పెద్దగా వర్క్ అవుట్ అవట్లేదు.

అందుకే జెమిని టివి వరుసగా స్టార్ సినిమాలు శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేస్తుంది. తప్పకుండా ఈ సినిమా అంచనాలను అందూనేలా ఉంటుందని చెప్పొచ్చు. అజ్ఞాతవాసి తర్వాత పవర్ స్టార్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ఆ అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని అంటున్నారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ చంద్రలతో సినిమాలు లైన్ లో పెట్టాడు పవన్ కళ్యాణ్. 2021, 2022 షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాడు పవర్ స్టార్.                                            

మరింత సమాచారం తెలుసుకోండి: