యువ నటుడు శర్వానంద్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రన్ రాజా రన్. అప్పట్లో చిన్న సినిమాగా రిలీజ్ అయి అతి పెద్ద విజయం అందుకున్న ఈ సినిమా లోని సాంగ్స్ కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో సినిమా తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు సుజిత్. యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ కమర్షియల్ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ అనంతరం ఈ సినిమా మాత్రం ఆశించినంత సక్సెస్ ని దక్కించుకోలేకపోయింది.

కానీ అటు నార్త్ లో మాత్రం సాహో సినిమా అదిరిపోయే రేంజిలో కలెక్షన్లు రాబట్టడం జరిగింది. ఇకపోతే తదుపరి సుజిత్ చేయబోయే సినిమాలకు సంబంధించి కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అతి త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ని సుజిత్ తెరకెక్కించనున్నాడు అంటూ కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ సినిమా చేతులు మారిందని అతని స్థానంలోకి వినాయక్ వచ్చారు అంటూ మరొక వార్త కూడా ప్రచారం అవుతోంది.

ఇక ఆ విషయాలు అటుంచితే ప్రస్తుతం సుజిత్ విషయమై మరొక కొత్త వార్త తెరపైకి వచ్చింది. లూసీఫర్ సినిమా రీమేక్ అవకాశం చేజారడం తోనే సుజీత్ తదుపరి సినిమా కథపై దృష్టి పెట్టి ప్రస్తుతం పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకున్నాడని కాగా సినిమా యాక్షన్ హీరో గోపీచంద్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఇటీవల గోపీచంద్ ను కలిసి ఈ సినిమా కథ స్క్రిప్ట్ వినిపించిన సుజిత్ ఆయనకు కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతి త్వరలో దాన్ని పట్టాలెక్కించేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట సుజీత్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని కూడా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లోనే రూపొందనుందని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు  వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: