వరుస అపజయాలతో డీలా పడుతూ వచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒక్కసారిగా కిశోర్ తిరుమల దర్సకత్వంలో తెరకెక్కిన 'చిత్ర లహరి'సినిమాతో మంచి విజయం సాధించి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత మారుతీ డైరెక్షన్లో వచ్చిన 'ప్రతీ రోజు పండగే'సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ ని అందుకుని సాయి తేజ్ కి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ని అందించాయి. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్' నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను బి.వి.ఎస్. ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. యువ సంగీత తరంగం థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తేజూ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

 ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి చాలా రోజులే అవుతుంది. సినిమాను విడుదల చేయాలని అనుకున్న ఇంకా థియేటర్లు ఓపెన్ అవ్వకపోవడంతో మూవీ యూనిట్ వెనక్కి తగ్గారు. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులను నిర్మాత ఓ ఓటీటీ సంస్థకు అమ్మేశారు. డిజిటల్, శాటిలైట్ హక్కులను తన దగ్గరే ఉంచుకుని థియేటర్ హక్కులను సదరు ఓటీటీ సంస్థకు అమ్మేసినట్టు తాజా సమాచారం. ఈ సినిమా థియేటర్ హక్కులను యువి సంస్థ రూ.8 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికి సంబంధించి ఇటీవలే ఓ పోస్టర్ ని సైతం వదిలి.. విడుదల తేదీని ప్రకటించారు. అంతేకాదు లాక్ డౌన్ తర్వాత దాదాపు8 8 నెలల తర్వాత థియేటర్లో విడుదలయ్యే మొదటి సినిమా కూడా ఈ మెగా హీరోదే కావడం విశేషం.మరి ఈ సినిమాతో మెగా మేనల్లుడు హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత తేజూ. దేవా కట్టా డైరెక్షన్లో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: